న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టులో తెలుగమ్మాయి సహజ యామ్లపల్లి చోటు దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో హాంగ్జూ వేదికగా ఆసియా గేమ్స్ జరుగనుండగా.. దీని కోసం అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) మంగళవారం 12 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది.
పురుషుల విభాగంలో వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్నతో పాటు సుమిత్ నాగల్, శశికుమార్, రామ్కుమార్, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేనీ జట్టులో చోటు దక్కించుకున్నారు. మహిళల విభాగంలో అంకితారైనా, కర్మన్కౌర్, రుతుజ, వైదేహీ, ప్రార్థనతో కలిసి సహజ బరిలోకి దిగనుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల టెన్నిస్లో మనవాళ్లు మూడు పతకాలు (ఒక స్వర్ణం, 2 కాంస్యాలు) సాధించిన విషయం తెలిసిందే.