దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో టీమ్ఇండియా స్వింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో భువీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో 4.65 ఎకానమీ రేటులో ఆరు వికెట్లు తీసిన అతడు టీ20ల్లో ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు. అవార్డు కోసం భువీతో పాటు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్, సీన్ విలియమ్స్(జింబాబ్వే) పోటీలో ఉన్నారు.