ముంబై : డక్కెన్ ఛార్జర్స్ కేసులో బీసీసీఐ ఊరట లభించింది. డెక్కన్ ఛార్జర్స్కు రూ.4800 కోట్లు చెల్లించాలంటూ గతంలో బీసీసీఐకి ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ జీఎస్ పటేల్తో కూడిన బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది. డక్కెన్ ఛార్జర్స్ ఐపీఎల్ జట్టును 2012లో రద్దు చేశారు. దానిపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కేసు పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సీకే తక్కర్ను ముంబై కోర్టు ఆర్బిట్రేటర్గా నియమించింది. ఇండియన్ క్రికెట్ బోర్డు రూ.4800 కోట్లు డెక్కన్ ఛార్జర్స్కు చెల్లించాలంటూ గత ఏడాది జూలైలో ఆర్బిట్రేటర్ ఆదేశించారు. ఆ ఆదేశాలను బీసీసీఐ కోర్టులో సవాల్ చేసింది. 2009లో ఐపీఎల్ ట్రోఫీని డక్కన్ ఛార్జర్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నియమావళిని ఉల్లంఘించడం వల్లే ఆ జట్టు ఫ్రాంచైజీని రద్దు చేసినట్లు బీసీసీఐ చెప్పింది. కోర్టు తీర్పు సంతోషకరంగా ఉందని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్రకారమే చేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.