ప్రస్తుతం ప్రపంచమంతా ఒకే ఒక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
షార్జాలో ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న గంగూలీ.. ఇది న్యూజిలాండ్ టైమ్ అంటూ పేర్కొన్నారు. వాళ్ల సమయం వచ్చేసింది. క్రికెట్ ప్రపంచంలో తామేంటో నిరూపించుకోవాల్సిన సమయం న్యూజిలాండ్కు ఇప్పుడు వచ్చింది. వాళ్లు ఖచ్చితంగా నిరూపించుకుంటారు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ను గెలిచిన ఫైర్లో ఉన్నారు. అలాగే.. ఆస్ట్రేలియా కూడా గొప్ప టీమ్. కానీ.. ఇప్పుడు వాళ్లది క్లిష్ట సమయం.. అంటూ గంగూలీ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
T20 World Cup Final : ఈమ్యాచ్లోనూ టాసే కీలకం.. టాస్ గెలిచిన జట్టుదే ట్రోఫీ.. కారణం ఇదే
T20 World Cup Final : ఈసారి ట్రోఫీ ఆ జట్టుకేనట.. ఎలాగో కూడా చెప్పేసిన నెటిజన్లు
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? ఏ టీమ్ ఎక్కువసార్లు గెలిచింది?
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్