రాంచీ: రాంచీ టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ షోయెబ్ బాషిర్(Shoaib Bashir) .. ఇండియన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. బాషిర్ తన స్పిన్తో కీలక వికెట్లను పడగొట్టేశాడు. శుభమన్ గిల్, పటిదార్, జడేజా వికెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసింది. ఇండియన్ బ్యాటర్ జైస్వాల్ 67, సర్ఫరాజ్ 3 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇంకా 217 రన్స్ వెనుకబడి ఉంది ఇండియా. రెండో సెషన్లో ఇండియా స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది.
Shoaib Bashir’s triple strike boosts England in the second session on Day 2 👊#WTC25 | #INDvENG 📝: https://t.co/XVNrBG1NYQ pic.twitter.com/Genz8kQOn5
— ICC (@ICC) February 24, 2024