IND vs BAN : భారీ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్ అనాముల్ హక్ (8 రన్స్) వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో అతను ఔట్ అయ్యాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికి సిరాజ్ క్యాచ్ పట్టడంతో అనాముల్ పెవిలియన్ బాట పట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో బంగ్లా ఓపెనర్లు లిట్టన్ దాస్, అనాముల్ ధాటిగా ఆడి శుభారంభం ఇవ్వాలనుకున్నారు. ఇద్దరూ నాలుగు ఓవర్లలో బౌండరీలు బాది 33 పరుగులు రాబట్టారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ బంతిని స్పిన్నర్ అక్షర్ పటేల్కు అందించాడు. అక్షర్ మొదటి బంతికే అనాముల్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం లిట్టన్ దాస్, షకిబుల్ హసన్ క్రీజులో ఉన్నారు.
ఇషాన్ కిషన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (204) సాధించాడు. విరాట్ కోహ్లీ (113) కూడా సెంచరీతో చెలరేగాడు. చివర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (20 రన్స్) , వాషింగ్టన్ సుందర్ (37 పరుగులు) ధాటిగా ఆడడంతో భారత్ 409 పరుగులు చేసింది.