BAN vs IND : భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ ఆలౌట్ అయంది. అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో బంగ్లా 227 పరుగులకు కుప్పకూలింది. పదో స్థానంలో వచ్చిన ఖలిద్ అహ్మద్ను అశ్విన్ అవుట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసిన బంగ్లా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. బంగ్లాను ఉమేశ్ యాదవ్ దెబ్బతీశాడు. అతను వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. 68వ ఓవర్ నాలుగో బంతికి ఉమేశ్, నురుల్ హసన్(6)ను ఎల్బీగా అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ రాహుల్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. దాంతో బంగ్లా 7 వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు ఓవర్లో ఉమేశ్ ప్రమాదకరమైన మెహిదీ హసన్ మిరాజ్ను వెనక్కి పంపాడు. 15 పరుగులు చేసిన మెహిది, రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో మహినుల్ హక్, మిరాజ్ జోడీ 41 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
లిట్టన్ దాస్ 25, షకిబుల్ హసన్ 16, ముష్ఫికర్ రహీం 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో భారత పేసర్లు6 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ఉనద్కత్ కీలకమైన జకిర్, ముష్ఫికర్ వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఉనద్కత్ 2 వికెట్లు పడగొట్టడు. తొలి టెస్టులో నెగ్గిన టీమిండియా ఈ టెస్టులో కూడా గెలిచి క్వీన్స్వీప్ చేయాలనుకుంటోంది.