Cricket : మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్పై 221 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ను వైట్వాష్ చేసింది. వర్షం కారణంగా అంపైర్లు మూడో వన్డేను 48 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (106), ట్రావిస్ హెడ్ (152) సెంచరీలతో చెలరేగడంతో 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. వీళ్లిద్దరూ రికార్డు స్థాయిలో 269 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 364 పరుగుల లక్ష్యం విధించారు. భారీ టార్గెట్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ జేసన్ రాయ్ 33 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో, 31.4 ఓవర్లలో 142 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంతో సిరీస్ని గెలిచింది. ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. ఈమధ్యే వన్డే జట్టు పగ్గాలు చేపట్టిన కమిన్స్కు కెప్ట్న్గా ఇదే మొదటి సిరీస్ విజయం.