ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆసీస్ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించిన కంగారూలు.. రెండో టెస్టును కూడా అద్భుతంగా ఆరంభించారు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. డేవిడ్ వార్నర్ (95), మార్నస్ లబుషేన్ (103), స్టీవ్ స్మిత్ (93), అలెక్స్ కేరీ (51), మిచెల్ స్టార్క్ (39 నాటౌట్), మైకేల్ నెజర్ (35) రాణించడంతో భారీ స్కోరు చేసింది.
మ్యాచ్ రెండో రోజు 473/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ౩, జేమ్స్ ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు హసీబ్ హమీద్ (6), రోరీ జోసెఫ్ బర్న్స్ (4) పూర్తిగా నిరాశపరిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (5 నాటౌట్), డేవిడ్ మలాన్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు.