ఢాకా : భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమంటూ పట్టుదలకు పోయి ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యాక బంగ్లాదేశ్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్న అసిఫ్ నజ్రుల్ మాట మార్చాడు. భారత్లో ఆడకపోవడంపై నిర్ణయం తమ (ప్రభుత్వానిది) కాదని, దేశ గౌరవం కోసం అది క్రికెటర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని మాట మార్చాడు.
బుధవారం నజ్రుల్ ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ ఆడనందుకు విచారమేమీ లేదు. ఆ నిర్ణయం దేశ క్రికెట్ బోర్డు, క్రికెటర్లు సమిష్టిగా తీసుకున్నది. దేశ గౌరవాన్ని కాపాడేందుకు వారు ఈ త్యాగం చేశారు’ అని అన్నాడు. ఇదే నజ్రుల్ జనవరి 22న మాట్లాడుతూ.. ‘ఐసీసీ మాకు న్యాయం చేయదు. అయితే మేం ప్రపంచకప్లో ఆడాలా? వద్దా? అన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.