చాంగ్వాన్: భారత షూటర్ మనూ భాకర్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైంది. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన చేసి ఐదో స్థానంలో నిలువడం ద్వారా ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ నగరంలో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ ఛాంపియన్సిప్-2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మనూ భాకర్ 5వ స్థానంలో నిలిచింది.
దాంతో పతకం చేజారినా 2024లో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం దక్కింది. టోక్యో ఒలింపియన్ కూడా అయిన మనూ భాకర్ .. 591 స్కోర్తో ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఆమె కేవలం 24 స్కోర్ మాత్రమే చేయగలిగింది. దాంతో చైనాకు చెందిన లియూ రుయ్ (37 స్కోర్), ఇరాన్కు చెందిన రోస్టమియాన్ హనియెహ్ (36), చైనాకే చెందిన ఝావో నన్ (32), ఫెంగ్ సిక్సువాన్ (27) ల తర్వాత 24 పాయింట్లతో మనూ 5వ స్థానంలో నిలిచింది.
వచ్చే ఏడాది (2024) జరుగనున్న పారిస్ ఒలింపిక్స్కు ది ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్-2023 ఒక క్వాలిఫయింగ్ ఈవెంట్. మొత్తం 12 షూటింగ్ ఈవెంట్స్లో ఈవెంట్కు ఇద్దరు చొప్పున బెస్ట్ ఫినిషర్స్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. ఒక ఈవెంట్లో ఒక దేశం రెండు కోటా స్పాట్స్కు మించి సాధించలేదు.