Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరుకొనసాగుతున్నది. వంద పతకాల వైపు వడివడిగా దూసుకుపోతున్నది. పురుషుల కనోయ్ (Canoe) డబుల్ 1000 మీటర్ల ఫైనల్లో టీమ్ఇండియా రజత పతకం (Bronze Medal) సాధించింది. అర్జున్ సింగ్ (Arjun Singh), సునీల్ సింగ్తో (Sunil Singh) కూడిన భారత జట్టు 3:53.329 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక 3:43.796 సెకన్లతో ఉజ్బెకిస్థాన్ గోల్డ్ సొతం చేసుకోగా, 3:49.991 సెకన్లతో రెండో ప్లేస్లో నిలిచిన కజక్స్థాన్ కాంస్యం గెలుపొందింది. కాగా, ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి.
దీంతో పతకాల పట్టికలో 61 మెడల్స్తో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నది. ఇందులో 13 స్వర్ణాలు, 24 కాంస్యం, 24 రజతాలు ఉన్నాయి. తొమ్మిదో రోజైన శుక్రవారం 3 రజతాలు 4 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు గెలుపొందారు.