న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న 19వ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత సెయిలర్లు సత్తా చాటారు. మూడో రోజైన మంగళవారం భారత సెయిలర్లు ఏకంగా మూడు పతకాలు సాధించారు. ఇవాళ ఉదయాన్నే 17 ఏళ్ల సెయిలర్ నేహా థాకూర్ (Neha Thakur) ఐఎల్సీఏ-4 ఈవెంట్లో 32 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. థాయిలాండ్కు చెందిన నొప్పసొరన్ కున్బూంజన్ టాప్ స్కోర్తో స్వర్ణ పతకం గెలువగా, సింగపూర్కు చెందిన కీరా మేరీ కార్లైల్ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆ తర్వాత మెన్స్ విండ్ సర్ఫర్ RS:X (windsurfer RS:X) ఈవెంట్లో మరో సెయిలర్ ఎబాద్ అలీ పతకం సాధించాడు. రేసులో 52 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచాడు. ఆ తర్వాత మరో సెయిలర్ 24 ఏళ్ల విష్ణు శరవణన్ మెన్స్ డింగీ ICLA-7 ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. సింగపూర్ సెయిలర్ గోల్డ్ మెడల్, దక్షిణకొరియా సెయిలర్ రజతం సొంతం చేసుకున్నారు.