Asian Hockey Championship | చెన్నై: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్లో భారత్ 7-2తేడాతో చైనాపై ఘన విజయం సాధించింది. మ్యాచ్లో ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియా..చైనాను ఏ దశలోనూ కోలుకోనివవ్వలేదు. భారత్ తరఫున హర్మన్ప్రీత్సింగ్(5ని, 8ని), వరుణ్కుమార్(19ని, 30ని) డబుల్ గోల్స్ చేయగా, సుఖ్జీత్సింగ్(15ని), ఆకాశ్దీప్సింగ్(16ని), మణ్దీప్సింగ్(40ని) గోల్స్ చేశారు. వెనుహ్(18ని), జావో జిషెంగ్(25ని) చైనాకు గోల్స్ అందించారు.
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు ముందు జరుగుతున్న ఈ టోర్నీలో ఎలాగైనా సత్తాచాటాలని భారత్ చూస్తున్నది. శుక్రవారం తమ రెండో మ్యాచ్లో జపాన్తో భారత్ తలపడుతుంది. మిగతా మ్యాచ్ల్లో మలేషియా 3-1తో పాకిస్థాన్పై, కొరియా 2-1తో జపాన్పై గెలిచాయి.