బెంగళూరు: విశ్వక్రీడల్లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. టోక్యో ఒలింపిక్స్లో నిరాశతో వెనుదిరిగిన భారత్ బృందం ఈ టోర్నీలో సత్తా చాటి కప్ దక్కించుకునేందుకు కొరియాకు మంగళవారం బయల్దేరింది. ఈనెల 5 నుంచి డొంగ్హే వేదికగా షురూ కానున్న టోర్నీలో భారత్ సింగిల్ పూల్లో చైనా, కొరియా, జపాన్, థాయిలాండ్, మలేషియాతో తలపడనుంది. తొమ్మిదో ర్యాంక్లో ఉన్న టీమ్ఇండియా ఈనెల 5న తొలి మ్యాచ్లో థాయిలాండ్తో, 6న మలేషియా, 9న చైనా, 11న జపాన్తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది.