ముంబై: ఆసియాకప్ షెడ్యూల్పై సందిగ్ధతకు తెరపడింది. బుధవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్న ఆసియాకప్ను వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్నారు. ఆగస్టు 30న ముల్తాన్లో పాకిస్థాన్, నేపాల్ మధ్య పోరుతో ఆసియా కప్నకు తెరలేవనుంది. సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్థాన్తో భారత్ తమ తొలి పోరులో తలపడనుంది. 4న నేపాల్తో టీమ్ఇండియా ఆడుతుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న వైవిధ్యమైన పరిస్థితుల దృష్ట్యా గతానికి భిన్నంగా ఈసారి టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.