IND vs PAK | కొలంబో: ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరుగనున్న భారత్, పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వెల్లడించింది. టోర్నీలో భాగంగా ఈ నెల 4న భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈసారి అలా జరగకూడదనే ముందు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇతర మ్యాచ్లకు కాకుండా కేవలం ఈ ఒక్క పోరుకే రిజర్వ్ డే కేటాయించడం విమర్శలకు తావిచ్చినా.. తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని ఏసీసీ ప్రకటించింది. దాయాదుల మధ్య సమరానికి ఈసారి కూడా వరుణుడు అడ్డుపడితే.. మ్యాచ్ ఆగిన చోటు నుంచి మరుసటి రోజు ఆట కొనసాగించనున్నట్లు వెల్లడించింది.