హైదరాబాద్, ఆట ప్రతినిధి: జపాన్ వేదికగా జరుగనున్న ప్రపంచ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి బరిలోకి దిగుతున్నది. వచ్చే నెల 18న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి పోటీపడుతున్న ఆరుగురిలో అరుణ చోటు దక్కించుకుంది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఈ యువ జిమ్నాస్ట్ ప్రస్తుతం అంబాల(హర్యానా)లో శిక్షణ పొందుతున్నది. ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి.. సోమవారం అరుణను కలిసి అభినందించారు. ప్రపంచ టోర్నీలో పతకం గెలిచి దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరారు. గతంలో జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో కాంస్య పతకం గెలిచి తొలి భారత ప్లేయర్గా నిలిచిన అరుణకు సీఎం కేసీఆర్ రూ.2 కోట్ల ప్రోత్సాహం ఇచ్చారని ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ గుర్తు చేశారు.