దోహా: ఫిఫా ఫుట్బాల్ వరల్డ్కప్ ఫైనల్లోకి అర్జెంటీనా ప్రవేశించింది. క్రొయేషియాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో విక్టరీ సాధించింది. లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆట ఆరంభం నుంచి మెస్సీ తన అటాకింగ్ స్కిల్స్తో క్రొయేషియాతో ముప్పుతిప్పలు పెట్టాడు. అర్జెంటీనా వరల్డ్కప్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇది ఆరోసారి.
అర్జెంటీనా మరో ప్లేయర్ అల్వరేజ్ కూడా సూపర్ గేమ్తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ 34వ నిమిషంలో క్రొయేషియా గోల్ కీపర్ డామినిక్ లివాకోవిక్ ఫౌల్ చేయగా పెనాల్టీ ఇచ్చారు. ఆ అవకాశాన్ని మెస్సి వినియోగించుకున్నాడు. 39వ నిమిషంలో మెస్సి ఇచ్చిన పాస్ను అద్భుత రీతిలో గోల్గా మలిచాడు అల్వరేజ్.
ఇక సెకండ్ హాఫ్లో బ్రేక్ తర్వాత మెస్సీ మళ్లీ మాయ చేశాడు. గోల్ పోస్టును అటాక్ చేశాడు. క్రొయేషియా డిఫెండర్లను దాటుకుంటూ మెస్సి గోల్ పోస్టు దిశగా దూసుకువెళ్లాడు. మెస్సి ఇచ్చిన పాస్తో.. అల్వరేజ్ 69వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో క్రొయేషియాపై అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో నెగ్గి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.