హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలోని స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న అకాడమీల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని సైక్లింగ్ వెలోడ్రోమ్లో జరుగుతున్న సైక్లింగ్ సెలెక్షన్ ప్రక్రియను సాట్స్ చైర్మన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాడమీల్లో శిక్షణ పొందిన ఎందరో క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నూతనంగా మరో 6 క్రీడా అకామీలను మంజూరు చేయడం ద్వారా వేలాది మంది యువకుల కలల సాకారానికి బాటలు వేశారని అన్నారు. నిపుణులైన్ కోచ్ల సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోకుల్, నర్సింగ్ రావు, జైపాల్, విజయ్ భాస్కర్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.