Anand Mahindra | ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదుటెస్టుల సిరీస్లో భారత్ తలపడుతున్నది. ముంబయి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మూడోటెస్ట్ మ్యాచ్లో తొలిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే 62 పరుగులు చేసి రాణించాడు. 2013లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. పదేళ్ల తర్వాత టీమిండియాలో చోటుదక్కింది. రాజ్కోట్లో జరుగుతున్న తొలిటెస్టులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలతో కదం తొక్కినా.. సర్ఫరాజ్ అర్ధ సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సర్ఫరాజ్ను ప్రశంసిస్తున్నారు.
ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం చేరారు. సర్ఫరాజ్ తండ్రికి థార్ కారును బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో సర్ఫరాజ్ను మహీంద్రా ప్రశంసిస్తూనే తన సందేశాన్ని చెప్పారు. ‘ధైర్యం కోల్పోవద్దు. శ్రమ, ధైర్యం, సహనం. పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు తండ్రికి ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది. స్ఫూర్తిదాయకమైన తండ్రిగా నౌషాద్ ఖాన్ ‘థార్’ కానుకగా స్వీకరిస్తే అదే నాకు నాకు ఆనందం.. దక్కిన గౌరవం’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
రాజ్కోట్ టెస్టు తొలి ఇన్సింగ్స్లో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత సర్ఫరాజ్ బ్యాటింగ్కు వచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చిచెండాడు. సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చిన సమయంలో రవీంద్ర జడేజా 84 పరుగుల వద్ద ఉండగా.. సర్ఫరాజ్ పెవిలియన్కు చేరే సమయంలో 99 పరుగులు చేశాడు. దాంతో సర్ఫరాజ్ బ్యాటింగ్ ఎలా సాగిందో తెలుస్తుంది. సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ సాధిస్తాడని అనుకున్నా 62 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగాడు.
“Himmat nahin chodna, bas!”
Hard work. Courage. Patience.
What better qualities than those for a father to inspire in a child?
For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp
— anand mahindra (@anandmahindra) February 16, 2024