ముంబై: భారత మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో బరిలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. సెయింట్ కీట్స్ నెవిస్ పాట్రియాట్స్ జట్టు రాయుడును మార్క్యూ ప్లేయర్గా ఎంపిక చేసుకుంది. అన్ని సజావుగా సాగి రాయుడు సీపీఎల్లో ఆడితే.. ఈ లీగ్లో ప్రాతినిధ్యం వహించిన రెండో భారత ప్లేయర్గా నిలువనున్నాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి ప్రవీణ్ తాంబే మాత్రమే సీపీఎల్లో ఆడాడు. ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు ఫైనల్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ విధించిన ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ నిబంధన.. భారత మాజీ ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు ప్రతిబంధకంగా మారింది.