Lakshya Sen | ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీలో భారత్ షట్లర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మలేషియా ప్లేయర్ లీ జీ జియాపై 21-13, 12-21, 21-19 తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లాడు. దీంతో ఏడేండ్ల తర్వాత ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకున్న భారత ప్లేయర్గా లక్ష్యసేన్ నిలిచాడు.
దీంతో సింగిల్స్ విభాగంలో ఆల్ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు 1947లో ప్రకాశ్ నాథ్, 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్, 2015లో సైనా నెహ్వాల్ ఫైనల్కు చేరుకున్నారు. ఆదివారం జరిగే ఫైనల్స్లో గెలుపొందితే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలుచుకున్న మూడో భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.