హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్ వుషు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఆన్లైన్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అలీ మీర్జా కాంస్య పతకంతో మెరిశాడు. చండీగఢ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పోటీల్లో హైదరాబాదీ అలీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సబ్ జూనియర్ విభాగంలో పోటీపడ్డ అలీ 6.38 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో బరిలోకి దిగిన అర్హాన్(అస్సాం), సశ్వత్ దాస్(బీహార్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు.