ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో తెలంగాణ యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, సురావజ్జుల స్నేహిత్ చోటు దక్కించుకున్నారు. వచ్చే నెల పుణే వేదికగా యూటీటీ నాలుగో సీజన్ జరుగనుండగా.. దీనికోసం శుక్రవారం ప్లేయర్లను ఎంపిక చేసుకున్నారు. లీగ్లో ఆరు జట్లు పోటీపడుతుండగా.. కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత శ్రీజను దబాంగ్ ఢిల్లీ సొంతం చేసుకుంది. స్నేహిత్ పుణేరి పల్టన్ జట్టుకు ప్రాతనిధ్యం వహించనున్నాడు.
యూటీటీ లీగ్ మూడో సీజన్ 2019లో జరుగగా.. ఆ తర్వాత కరోనా కారణంగా సుదీర్ఘ విరామం అనంతరం లీగ్ తిరిగి ప్రారంభం కానుంది. ‘యూటీటీ లీగ్లో అరంగేట్రం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకొని మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తా’ అని స్నేహిత్ పేర్కొన్నాడు. ఈ లీగ్లో వివిధ జట్ల తరఫున శరత్ కమల్, సాతియాన్, మనికా బాత్రా, మనవ్ ఠక్కర్ వంటి దేశీ స్టార్లతో పాటు పలువురు వీదేశీ ఆటగాళ్లు కూడా పోటీపడుతున్నారు.