న్యూఢిల్లీ : ఎలాగైనా 90మీ. దూరాన్ని అధిగమిస్తానని ఒలింపిక్, ప్రపంచ జావెలిన్ చాంపియన్ నీరజ్ చోప్రా విశ్వాసం వ్యక్తంచేశాడు. సాంకేతిక లోపాలను సవరించుకుని వచ్చే యేడాది 90మీ. లక్ష్యాన్ని చేరుకుంటానని అన్నాడు. ముఖ్యంగా కాళ్లు మడతపడే అంశంపై దృష్టి సారించానని, ఆ లోపాన్ని సవరించుకుంటే తన లక్ష్యాన్ని అధిగమించడం కష్టంకాబోదన్నాడు.
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ ఈ యేడాది ఆరంభంలో ప్రపంచ చాంపియన్గానూ అవతరించాడు. ఇప్పటికీ తనలోని అత్యుత్తమ ప్రతిభ వెలికి రాలేదని 25 ఏళ్ల నీరజ్ అన్నాడు.