7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: విలేకర్ల ఆటవిడుపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ (ఎమ్పీఎల్)లో నమస్తే తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఎల్ఆర్ఐటీ)లో మంగళవారం హెచ్ఎంటీవీతో జరిగిన మ్యాచ్లో నమస్తే తెలంగాణ 6 వికెట్లతో గెలిచింది. హెచ్ఎంటీవీ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. రవి (39 బంతుల్లో 49 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రదీప్ (4/16), సాయిచందర్ (3/16), సందీప్ (2/17) ధాటికి హెచ్ఎంటీవీ 16.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. విజేతగా నిలిచిన నమస్తే తెలంగాణ జట్టును ఎమ్ఎల్ఆర్ఐటీ సెక్రెటరీ మర్రి రాజశేఖర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారుల కోసం కాలేజీలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.