చెన్నై: ప్రతిష్ఠాత్మక 44వ చెస్ ఒలింపియాడ్కు తెరలేచింది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న మెగాటోర్నీకి గురువారం అట్టహాసంగా మొదలైంది. మొత్తం 300 జట్లు పోటీపడుతున్న టోర్నీని ప్రధాని నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆతిథ్య తమిళనాడు సంస్మృతిని ప్రతిబింబిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఒలింపియాడ్ టార్చ్ను ముఖ్యమంత్రి స్టాలిన్కు అందజేశారు. శుక్రవారం నుంచి మొదలవుతున్న టోర్నీ తొలి రౌండ్లో భారత మహిళల ‘ఎ’ జట్టు నల్లపావులతో బరిలోకి దిగనుంది.