దేశవాళీ అండర్-19 టోర్నీ కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక ప్లేయర్ ప్రాఖర్ చతుర్వేది (404 నాటౌట్; 46 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి క్వాడ్రపుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ముంబైతో జరిగిన ఫైనల్లో ప్రాఖర్ ఈ ఘనత సాధించాడు. దీంతో 24 ఏండ్లుగా యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 358 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు బద్దలైంది.