హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ సబ్జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన బాలికల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ రేసును 9:20:25 సెకన్లలో ముగించిన వ్రితి పసిడి పతకంతో మెరిసింది.
ఇదే విభాగంలో పోటీపడ్డ అదితి(కర్ణాటక), తితిక్ష రావత్(ఢిల్లీ)వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదే టోర్నీలో వ్రితి 1500 మీటర్ల విభాగంలోనూ స్వర్ణ సొంతం చేసుకుంది. బాలికల 400మీటర్ల మెడ్లె విభాగంలో శ్రీనిత్య రజతంతో మెరిసింది.