హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండవ ఆల్ఇండియా ఇంటర్క్లబ్ వాటర్ పోలో స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు సోమవారం మొదలయ్యాయి. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 11 జట్లు పాల్గొంటున్న టోర్నీ ఈనెల 26 వరకు జరుగనుంది. తొలి రోజు జరిగిన మ్యాచ్ల్లో ఆర్మీ రెడ్ 22-0తో హైదరాబాద్పై, కోల్కతా స్పోర్ట్స్ అసోసియేషన్ 10-5తో వైఎమ్సీ (కేరళ)పై, అమరావతి 16-0తో కర్ణాటకపై, దక్కన్ జింఖానా 10-7తో ఆర్మీ గ్రీన్పై, నేవి 5-3తో వెస్ట్ రైల్వేపై, ఇండియన్ ఫోర్స్ 9-5తో దక్కన్ జింఖానాపై, ఆర్మీ రెడ్ 9-1తో అమరావతిపై విజయాలు సాధించాయి. ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ విజయ్కుమార్, కార్యదర్శి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.