వాషింగ్టన్: వచ్చే ఏడాది ఫిఫా ఫుట్బాల్ వరల్డ్కప్ జరగనున్నది. దీని కోసం వాషింగ్టన్ డీసీలో తుది డ్రా చేశారు. ఆ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. మొత్తం మూడు దేశాలు వచ్చే ఏడాది ఫుట్బాల్ వరల్డ్కప్ నిర్వహించనున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో ఆ మ్యాచ్లు ఉంటాయి. మొత్తం 48 దేశాలు వరల్డ్కప్లో తలపడనున్నాయి. 2026 జూన్ 11వ తేదీన టోర్నీ ప్రారంభంకానున్నది. మొత్తం 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. గత చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ను డిఫెండ్ చేసుకునేందుకు ట్రై చేయనున్నది. మేటి ప్లేయర్ లియోనల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా తన తొలి మ్యాచ్లో అల్జీరియాతో తలపడనున్నది. కేప్ వర్డీ, కురకావో, జోర్డాన్, ఉజ్బకిస్తాన్ దేశాల్లో తమ గ్రూపు ప్రత్యర్థులు ఎవరో తెలుసుకున్నారు. నాలుగు సార్లు చాంపియన్షిప్ గెలిచిన జర్మనీతో కురకావో తన ఫస్ట్ మ్యాచ్లో పోటీపడనున్నది.
టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్కు మెక్సికో వేదిక కానున్నది. మెక్సికో సిటీలో ఉన్న అజ్టెకా స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. గ్రూపు ఏలో జూన్ 11వ తేదీన దక్షిణాఫ్రికాతో ఆ మ్యాచ్ ఉండనున్నది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే 42 జట్లు ఖరారు అయ్యాయి. ఇక ప్లేఆఫ్స్ లో ఉన్న ఆరు బెర్తుల కోసం 22 జట్లు పోటీపడనున్నాయి. వాటి ఫలితాలు మార్చి 31వ తేదీ వరకు తెలుస్తుంది. క్వార్టర్ ఫైనల్స్ నుంచి అన్ని మ్యాచ్లను అమెరికాలో నిర్వహించనున్నారు. జూలై 19వ తేదీన న్యూజెర్సీలోని ఈస్ట్ రూథర్ఫోర్డ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.
1966లో వరల్డ్కప్ టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి తన ఫస్ట్ మ్యాచ్లో క్రొయేషియాతో ఆడనున్నది. గ్రూప్ ఎల్లో ఘనా, పనామా దేశాలు కూడా ఉన్నాయి. ఈసారి మొత్తం 12 గ్రూపుల్లో జట్లు పోటీపడనున్నాయి. ఒక్కొక్క గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి.