FIFA World Cup : ఫిఫా వలర్డ్కప్ సెమీ ఫైనల్లో మొరాకో ఓటమి అనంతరం బ్రస్సెల్స్లో విధ్యంసానికి పాల్పడిన 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ప్రజా జీవనాన్ని స్తంభింప చేయడంతో పాటు రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించినందుకు వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెమీఫైనల్లో మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వందల సంఖ్యలో బ్రస్సెల్స్లో వీధుల్లోకి వచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మొరాకో అభిమానులు బ్రస్సెల్స్ వీధుల్లో వీరంగం సృష్టించారు. వాళ్లను నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులతో ఘర్షణకు దిగారు. దాంతో, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను చిత్తు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ మూడో టైటిల్పై కన్నేసింది. డిసెంబర్ 18వ తేదీన అర్జెంటీనాతో అమీతుమీకి సిద్ధమైంది. క్రొయేషియాను 0-3తో అర్జెంటీనా ఓడించింది. స్టార్ ఆటగాడు మెస్సీకి ఇదే చివరి ఫిఫా టోర్నీ. దాంతో, ట్రోఫీ గెలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు.
Enriched Belgium…
Moroccan fans are now also rioting in Brussels.
One-third of the country’s population is of foreign origin; in Brussels, Belgians are the minority. pic.twitter.com/5aZtcHiRn3
— Amy Mek (@AmyMek) December 15, 2022