IPL Mega Auction | ఐపీఎల్-2022 మెగా వేలం పూర్తయింది. 10 ఫ్రాంచైసీలు మొత్తం 204 మంది క్రికెటర్లను ఎంచుకున్నాయి. కానీ లెజెండ్స్కోసం ఒక్క ఫ్రాంచైసీ బిడ్ వేయలేదు. ఇషాన్ కిషన్ వంటి కుర్రాడి కోసం రూ.15.25 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైన జట్ల యాజమాన్యాలు.. మిస్టర్ ఐపీఎల్గా పాపులరైన సురేశ్ రైనా ముఖంకూడా చూడలేదు. ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో టీం యాజమాన్యాల ఆలోచనలు చాలా పెద్దవిగా ఉన్నాయి. పాత ఆటగాళ్లు.. సీనియర్లకు, విదేశీ స్పిన్ బౌలర్లకు, భారత్ పిచ్లపై అనుభవం లేని బ్యాట్స్మన్లపై పెద్ద ఆసక్తి చూపలేదు. పలువురు టాప్ ప్లేయర్లు.. రెండో రోజు వేలం ముగిశాక కూడా అన్సోల్డ్గానే మిగిలిపోయారు.
మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ముందుకు రాకపోవడం భారత్లోని ప్రతి క్రికెట్ ఫ్యాన్కు షాకింగ్ న్యూసే. సురేష్ రైనా స్ట్రైకింగ్ రేట్ 136.76 పరుగులు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. మధ్యలో గుజరాత్ లయన్స్ కెప్టెన్గా ఎంపికై తిరిగి వచ్చినా.. సీఎస్కే మేనేజ్మెంట్ అతడ్ని విశ్వసించలేదు. కొంతకాలంగా దేశవాళీ క్రికెట్కూ దూరంగానే ఉన్న రైనా.. ఇండియన్ క్రికెట్ టీం నుంచి రిటైరయ్యాడు. దీంతో ఏ జట్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్ల్లో 5528 పరుగులు (సగటున 32.51 పరుగులు) చేశాడు. ఇందులోనే ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలున్నాయి.
గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్లో ఆడిన ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా ఈ దఫా జట్టులో చేరలేదు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడకముందు రాజస్థాన్ రాయల్స్ సారధిగా పూర్ పెర్పార్మెన్స్ చూపాడు. కెప్టెన్సీలోనూ, బ్యాటింగ్లోనూ విపలమయ్యాడు. ఐపీఎల్లో స్మిత్ స్ట్రైక్ రేట్ 128.09 పరుగులుగా ఉంది. 103 మ్యాచ్లు ఆడిన స్మిత్ 2485 పరుగులు చేశాడు. యావరేజీ 34.51 పరుగులు. ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇటీవల టీ-20 వరల్డ్ కప్లోనూ ఆడినా చెప్పుకోదగిన ప్రత్యేకతలేం లేవు. 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎనిమిది మ్యాచ్లు ఆడిన స్మిత్.. చెప్పుకోదగిన పరుగులేమీ చేయలేదు.
నంబర్2 ఆల్రౌండర్, బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షాకిబ్ అల్ హసన్ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైసీ ముందుకు రాలేదు. ఐసీసీ ఓడీఐ ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్గా ఉన్న షాకిబ్.. 2021 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. 8 మ్యాచ్ల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. 34 ఏండ్ల వయస్సు ఉన్న షాకిబ్ను తీసుకుని ప్రయోగాలు చేయడానికి టీంలు సిద్ధంగా లేవని తెలుస్తున్నది.
ఐపీఎల్ టీంలు విదేశీ స్పిన్నర్లపై మోజు చూప లేదు. గత రెండు సీజన్లు విదేశాల్లో జరిగాయి. కానీ ఈ దఫా దేశీయంగానే ఐపీఎల్ టోర్నీ జరుగనున్నది. భారత్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలం. అయితే, దేశీయ స్పిన్నర్లను ఎంచుకోవడంపైనే ఫ్రాంచైసీలు దృష్టి పెట్టాయి తప్ప.. విదేశీ ప్లేయర్లను పట్టించుకోలేదు. ఇంగ్లండ్కు చెందిన అదిల్ రషీద్, ఆఫ్ఘన్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మన్, సౌతాఫ్రికా తాబ్రెజ్ షంషీ జోలికెళ్లలేదు. ఇమ్రాన్ తాహీర్కు వయస్సు సమస్య ఉన్నా ముజీబ్ ఉర్ రెహ్మాన్, అదిల్ రషీద్ మిస్టరీ స్పిన్నర్లుగా పేరుంది.
విదేశీ స్టార్ బ్యాట్స్మన్ల పట్ల కూడా ఫ్రాంచైసీలు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ప్రతి జట్టు టీం కూడా ఎక్కువ మంది టీ-20 స్పెషలిస్టు బ్యాట్స్మెన్లను ఎంచుకోలేదు. ఇంగ్లండ్ బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్, ఆసీస్ టీ-20 వరల్డ్ కప్ విజేత సారధి అరోన్ ఫించన్, ఇంగ్లండ్ టీ-20 సారధి ఎవోన్ మోర్గాన్ కూడా ఫ్రాంచైసీల దృష్టిని ఆకర్షించలేకపోయారు. ఇక దేశీయ బౌలర్లు అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లాను కొనుగోలు చేసేందుకు ఒక్క టీం యాజమాన్యం కూడా ముందుకు రాలేదు. ఇంగ్లండ్ టీ-20 సారధి ఎవోన్ మోర్గాన్.. కొంతకాలంగా టీ-20 క్రికెట్ ఆడటం లేదు. అయినా, కోల్కతా నైట్ రైడర్స్కు సారధిగా జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాడు. కానీ కోల్కతా నైట్ రైడర్స్.. శ్రేయాస్ అయ్యర్తో ప్రయోగమే చేయబోతున్నది.