కామారెడ్డి,జనవరి 10: జిల్లా కేంద్రం వేదికగా జరుగుతున్న జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ టోర్నీలో హర్యానా, కర్ణాటక ఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కర్ణాటక 7 పాయింట్లతో ఢిల్లీపై విజయం సాధించింది.
మరో సెమీస్లో హర్యానా 29 పాయింట్ల తేడాతో ఆతిథ్య తెలంగాణపై ఘన విజయం సొంతం చేసుకుంది. గెలుపు కోసం తెలంగాణ కడదాకా కొట్లాడింది. లైట్ల వెలుతురులో కబడ్డీ పోటీలు స్థానికులను కట్టిపడేశాయి. గురువారం హర్యానా, కర్ణాటక జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది.