బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. అప్పటి వరకు మంచి జోష్లో ఉంటున్న తెలుగు జట్టు.. ఆఖరికి వచ్చేసరికి ఒత్తిడికి లోనై వెనుకంజలో నిలుస్తున్నది. సోమవారం బెంగాల్ వారియర్స్తో జరిగిన పోరులోనూ చక్కటి ప్రదర్శనతో అధికభాగం ఆధిపత్యం కనబర్చిన తెలుగు టైటాన్స్.. ఆఖరికి 32-32తో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. గత రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొన్న టైటాన్స్కు ఇది కాస్తలో కాస్త ఊరటనిచ్చే అంశమే కాగా.. తెలుగు జట్టు తరఫున అంకిత్ (9 పాయింట్లు), రజనీష్ (7 పాయింట్లు) రాణించారు. బెంగాల్ కెప్టెన్ మణిందర్ సింగ్ (11) సత్తాచాటాడు. మరో మ్యాచ్లో జైపూర్ 36-31తో గుజరాత్ లయన్స్పై గెలుపొందింది.