ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్లో భారత్కు రెండు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత షూటర్ల హవా కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగాల్లో మనవాళ్లు స్వర్ణాలు సాధించారు. పిస్టల్ ఈవెంట్లో స్టార్ షూటర్లు మను బాకర్, సౌరభ్ చౌదరి
పసిడి పతకం నెగ్గగా.. రైఫిల్ ఈవెంట్లో ఎలెవెనిల్ వలరివన్, దివ్యాన్ష్ సింగ్ పన్వర్ గోల్డ్ కొల్లగొట్టారు. పిస్టల్ఈవెంట్లో భారత్కే చెందిన యశస్విని, అభిషేక్ వర్మ
జోడీ కాంస్యం దక్కించుకుంది. స్కీట్ ఈవెంట్లో భారత పురుషులు స్వర్ణం, మహిళల రజతం గెలుచుకున్నారు.