న్యూఢిల్లీ: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్గా చెన్నైకు చెందిన నేత్రా కుమారన్ చరిత్ర సృష్టించింది. ఒమన్ వేదికగా జరిగిన ఆసియా క్వాలిఫయర్స్ లేజర్ రేడియల్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన నేత్ర ఈ ఏడాది టోక్యో విశ్వక్రీడలకు క్వాలిఫై అయింది. ఫైనల్లో 21 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన రమ్య శరవణన్పై ఆమె పైచేయి సాధించింది.