స్టావెంజర్: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. నార్వే చెస్ టోర్నీలో రెండో విజయం పొందాడు. క్లాసికల్ విభాగంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్లో బల్గేరియా జీఎం వెసిలిన్ తోపలోవ్ను చిత్తు చేశాడు. 36 ఎత్తుల్లో ప్రత్యర్థిని ఓడించి దూకుడు కనబర్చాడు. ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుని ఆనంద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో ఆనంద్ 40 ఎత్తుల్లో లాగ్రేవ్ (ఫ్రాన్స్)ను ఓడించి శుభారంభం చేశాడు.