పటియాల: ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రెండు వేర్వేరు బరువు కేటగిరీల్లో బరిలోకి దిగడంతో పాటు డోపింగ్ పరీక్షలకు నిరాకరించడం వివాదం రేపింది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వినేశ్..సోమవారం జరిగిన ట్రయల్స్లో శివానీపై 11-6తో గెలిచి కిర్గిస్థాన్లో జరిగే క్వాలిఫయర్స్ టోర్నీకి అర్హత సాధించింది.