వాట్సాప్ యూజర్లు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మల్టీ డివైజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్తో యూజర్లు తమ ఫోన్లలోనే కాకుండా ఒకే సమయంలో నాలుగు ఇతర డివైజ్లలోనూ వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్లో ఈ ఫీచర్ ఉన్నదని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నా.. ఇప్పుడా సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా బీటీ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు కూడా వాట్సాప్ను డెస్క్టాప్, ల్యాప్టాప్లలో ఉపయోగిస్తున్నా.. ఫోన్ కచ్చితంగా ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండాలి. కానీ తాజా మల్టీ డివైజ్ ఫీచర్తో ఫోన్కు ఇంటర్నెట్ లేకపోయినా లేక మొత్తంగా స్విచాఫ్ అయినా కూడా నేరుగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో వాట్సాప్ వాడుకునే వీలుంటుంది. ఇన్నాళ్లూ డెస్క్టాప్కు మంచి నెట్వర్క్ ఉన్నా.. ఫోన్ నెట్వర్క్ సరిగా లేకపోతే వాట్సాప్ను వినియోగించడం సాధ్యం కాకపోయేది.
ఈ ఫీచర్ను వాట్సాప్ 2019 నుంచి పరీక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను మెయింటేన్ చేస్తూనే అన్ని డివైజ్లలోనూ యూజర్ డేటా అంటే మెసేజ్ హిస్టరీ, కాంటాక్ట్ నేమ్స్, స్టార్డ్ మెసేజ్లు సింక్ అయ్యేలా కొత్త టెక్నాలజీలాను అభివృద్ధి చేసినట్లు వాట్సాప్ తెలిపింది.