న్యూఢిల్లీ : వివో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ వివో వై75 భారత్ మార్కెట్లో లాంఛ్ అయింది. క్వాలిటీ ఇమేజ్లను ఇష్టపడే వారికోసం 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ రియర్ కెమరా వంటి ఫీచర్లతో న్యూ వివో వై75 అందుబాటులోకి వచ్చింది. ఫాస్ట్చార్జింగ్ టెక్నాలజీతో కూడిన బ్యాటరీ ఉండటంతో తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ స్మార్ట్ఫోన్ అనుకూలంగా ఉంటుంది.
మూన్లైట్ షాడో, డ్యాన్సింగ్ వేవ్స్ కలర్స్లో లభించే వై75 రూ 20,999కు అందుబాటులో ఉంది. మే 20 నుంచి ఈ స్మార్ట్ఫోన్ ప్లిఫ్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, రిటైల్ స్టోర్స్లో సేల్స్కు సిద్ధంగా ఉంది. ఇక ఈ స్మార్ట్పోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో కెమెరాలను కలిగిఉంది. న్యూ వై75 మీడియాటెక్ హెలియో జీ96 చిప్సెట్తో పాటు స్లీక్, ప్రీమియం డిజైన్తో ఆకట్టుకుంటుంది.
కెమెరాలో ఏఐ పవర్డ్ ఫీచర్లు ఉన్నాయని వివో వెల్లడించింది. 44 మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన హైలైట్గా వివో వై75 కస్టమర్ల ముందుకొచ్చింది. ఇందులో ఏఐ ఫేస్ బ్యూటీ, స్టీడీఫేస్ సెల్ఫీ, వీడియో ఫేస్ బ్యూటీ, పిక్చర్-ఇన్-పిక్చర్, డ్యూయల్ వ్యూ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. వివో వై75 4050ఎంఏహెచ్ బ్యాటరీతో 44డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.