వివో తాజాగా మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. మన దేశంలో వివో ఫోన్లకు బాగానే డిమాండ్ ఉంది. అందుకే.. ఆ డిమాండ్కు అనుగుణంగా వివో… సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా వివో వై53ఎస్ అనే మోడల్ను విడుదల చేసింది. ఈ ఫోన్ సేల్స్ కూడా ప్రారంభం అయ్యాయి. వివో వై53ఎస్ ధర 19,490 రూపాయలుగా నిర్ణయించారు.
అయితే.. 20 వేల రూపాయల బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కావాలనుకునేవాళ్లు మాత్రం ఈ ఫోన్ను తీసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్తో రన్ అవుతుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో నడుస్తుంది. ఈ ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, ఐక్యూఓఓ జెడ్3, సామ్సంగ్ గెలాక్సీ ఏ22, రియల్మీ 8 ప్రో ఫోన్లకు గట్టి పోటీని ఇస్తోంది.
ఒకే వేరియంట్తో విడుదలైన ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. డీప్ సీ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్లతో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ను వివా ఇండియా ఈ స్టోర్లో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఈఎంఐ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు నుంచి అంటే ఆగస్టు 9 నుంచే ఈ ఫోన్ల బుకింగ్స్ను ప్రారంభిస్తున్నట్టు వివో ప్రకటించింది.
1080 * 2480 పిక్సెల్ రిజల్యూషన్తో 6.58 ఇంచ్ ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ ఫన్ టచ్ 11.1 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ, 64 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ వర్షన్ 5.0, 2.4 జీహెచ్జెడ్ వైఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ లాంటి బెస్ట్ ఫీచర్లతో ఈ ఫోన్ లభించనుంది.