ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ట్విట్టర్లో లేదు. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేందుకు కంపెనీ ఆలోచిస్తోందని సమాచారం.
కొంత మంది గ్రూపుతో తమకు నచ్చిన ట్వీట్లను షేర్ చేసుకోవచ్చు. దీనిపై డెవలపర్ అలెజాండ్రో పాలుజ్జి మాట్లాడుతూ.. ట్విట్టర్ యూజర్లు తమ స్నేహితుల్లో 150 మందిని ఒక గ్రూప్గా చేసుకోవచ్చు. దీన్ని ‘ట్విట్టర్ ఫ్లాక్’ అంటున్నారట. ఈ గ్రూప్తో మాత్రమే ట్వీట్లను షేర్ చేసుకునే వీలుంటుంది.
ఈ గ్రూప్లో షేర్ చేసిన ట్వీట్లపై ఈ గ్రూప్లోని సభ్యులు మాత్రమే చూడగలుగుతారు. అలాగే రిప్లై ఇవ్వగలుగుతారని తెలుస్తోంది. ఈ ఫ్లాక్ నుంచి ఎవరినైనా తొలగించినా సదరు సభ్యుడికి ఎటువంటి నోటిఫికేషన్ లభించదని అలెజాండ్రో వివరించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ఫీచర్ను ట్విట్టర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.