న్యూఢిల్లీ : జులై 20న రెడ్మి కే50ఐ భారత్లో లాంఛ్ కానుంది. ఆగస్ట్ 2019 తర్వాత తొలిసారిగా రెడ్మి తన న్యూ కే సిరీస్ స్మార్ట్ఫోన్ను వెల్లడించనుంది. భారత్లో రెడ్మి కే50ఐ రూ 26,999 నుంచి ప్రారంభమవుతుందని అంచనా. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్పోన్ డెమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్, 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
గత కొద్దినెలలుగా రూ 30,000లోపు పలు స్మార్ట్ఫోన్లు లాంఛ్ అవడంతో ఆయా స్మార్ట్ఫోన్ల నుంచి రెడ్మి లేటెస్ట్ కే సిరీస్ ఫోన్కు పోటీ ఎదురవనుంది. రెడ్మి కే50ఐ స్మార్ట్ఫోన్ ప్రధానంగా పోకో ఎఫ్4 5జీ, ఐక్యూఓఓ నియో 6 5జీ, వన్ప్లస్ నార్డ్ 2టీ 5జీ, ఒప్పో రెనో 8 5జీ, మోటో ఎడ్జ్ 30, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ వంటి ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.