న్యూఢిల్లీ : భారత్లో రెడ్మి 11 ప్రైమ్ 5జీ సెప్టెంబర్ 5న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో లాంఛ్ డేట్ను వెల్లడించింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్గా కస్టమర్ల ముందుకొస్తున్న రెడ్మి 11 ప్రైమ్ 5జీ రూ 11,000కు అందుబాటులో ఉంటుంది. అఫిషియల్ లాంఛ్కు ముందు కంపెనీ రెడ్మి 11 ప్రైమ్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు కొన్నింటిని వెల్లడించింది.
అప్కమింగ్ 5జీ ఫోన్ వాటర్డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్ప్లేని కలిగిఉంటుందని రెడ్మి పోస్ట్ చేసిన టీజర్లో వెల్లడైంది. 50 ఎంపీ మెయిన్ సెన్సర్ సహా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో కస్టమర్ల ముందుకు రానుంది. బ్లూ, గ్రే కలర్స్లో లభించే ఈ స్మార్ట్ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ వెసులుబాటు కలిగిఉంది.
ఈ స్మార్ట్పోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 6.58 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.