ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో A సిరీస్లో కొత్త హ్యాండ్సెట్ను భారత్లో ఆవిష్కరించింది.
18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్న ఫోన్లో 5,000 mAh బ్యాటరీ ఉంది. 13 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.5 అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్రిస్టల్ బ్లాక్, మూన్లైట్ గోల్డ్, స్టారీ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 20 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా స్మార్ట్ఫోన్ సేల్ ఆరంభంకానుంది.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 1,000 తగ్గింపు లభించనుంది. ఒప్పో వినియోగదారులు అప్గ్రేడ్లో భాగంగా రూ .1,000 అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఒప్పో A54 పేరుతో విడుదలైన 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,490గా నిర్ణయించారు. ఇందులో మరో రెండు మోడళ్లు ఉన్నాయి. 4GB + 128GB ధర రూ.14,490 కాగా, 6GB + 128GB ధర రూ. 15,990గా ఉంది.