OnePlus Nord CE 3 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. వచ్చే నెల నాలుగో తేదీన వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ మార్కెట్లోకి రానున్నది. దీంతోపాటు వన్ప్లస్ నార్డ్ బడ్స్-2 కూడా ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఆధారంగా పని చేస్తుంది. 1800 x 2,400 పిక్సెల్స్ రిజొల్యూషన్తోపాటు ఎల్సీడీ డిస్ప్లేతో వస్తున్నది. స్నాప్ డ్రాగన్ 695 5జీ ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది. 8జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లో యూజర్లకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తున్నది. 108-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్ లెన్స్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్తో మరో కెమెరా వస్తుంది. ఇక సెల్పీల కోసం 16- మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎఫ్/2.5 అపెర్చర్ లెన్స్ (హోల్ పంచ్ కటౌట్)తో అందుబటులో ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటది. న్యూ లెమన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం అవుతుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 67 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతో వస్తుంది. ఇది 5జీతోపాటు బ్లూ టూత్ 5.1, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.