OnePlus Nord CE 2 | భారత్లో వన్ప్లస్ నోర్డ్ సీఈ 2 ఫోన్లకు ఉన్న డిమాండే వేరు. వన్ప్లస్ ఫోన్ల వైపే ఇండియన్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్లో సరికొత్త ఫీచర్లతో వన్ప్లస్ ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 17న వన్ప్లస్ నుంచి నోర్డ్ సిరీస్లో భాగంగా సీఈ2 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. అయితే.. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు అఫిషియల్గా రిలీజ్ కాకపోయినప్పటికీ.. సీఈ2 5జీ ఫోన్ ఫీచర్లు ఇవే అంటూ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రిలీజ్ కానుంది. రెండు వేరియంట్ల ధర కూడా రూ.25 వేల లోపే ఉండనున్నట్టు తెలుస్తోంది. వన్ప్లస్ నోర్డ్ సీఈ2 5జీ ఫోన్లో 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10 ప్లస్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్షిటీ 900 ఎస్వోసీ ప్రాసెసర్తో విడుదల కానుంది.
సోర్సెస్ ప్రకారం వన్ప్లస్ నోర్డ్ సీఈ 2 5జీ ఫోన్ 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉండనుంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉండనుంది.
ఆండ్రాయిడ్ 11 ఓఎస్, అండర్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, 64 ఎంపీ కెమెరా, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.