ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్నుంచి మరో రెండు కొత్త ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. తన సరికొత్త 10ఆర్ 5జీ, నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్ఫోన్లను ఏప్రిల్ 28న ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. 10 ప్రో 5జీ ఫోన్ విజయవంతం తర్వాత వన్ప్లస్ ఇప్పుడు 10ఆర్ 5జీ తో ముందుకొచ్చింది. ఈ 10ఆర్ 5జీ ఫోన్ 150వాట్స్ సూపర్ వూక్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇది చార్జింగ్ పెట్టిన 17 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇందులో బేస్ వేరియంట్ 10 ఆర్ మాత్రం 80 వాట్స్ సూపర్వూక్ టెక్నాలజీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
వన్ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 33వాట్స్ సూపర్ వూక్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఇది బ్యాటరీని 0 నుంచి 50శాతం వరకు 30 నిమిషాల్లో చార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. కాగా, మిగతా ఫీచర్లపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.